Sunday, June 21, 2026

‘మీరు తెలుగువాడని ఆజన్మాంతం గుర్తు పెట్టుకుంటాను’


సాయి పద్మ



సాయి పద్మ ఎఫ్బీలో షేర్‌ చేసిన ఫొటో

(సాయి పద్మ గారు 2021 సెప్టెంబర్‌ 11న ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ ఇది. ఇందులో ఆమె ప్రస్తావించిన సుధామయి గారు ఆజన్మం పబ్లిషర్‌. శ్రీదేవి మురళీధర్‌ వాళ్లు వేసిన ఒక పుస్తకం గురించి అంతకుముందెప్పుడో ఒకసారి సాయి పద్మ నాతో ఫోన్‌లో మాట్లాడారు. అదే పరిచయం. శరీరంతో ఆమె చేస్తున్న పోరాటం గురించి ఎఫ్బీలోనే తెలిసింది. చివరికి 2024 ఏప్రిల్‌ 15న ఆమె వెళ్లిపోయారు. కొన్ని సంభాషణలకు ఎప్పటికీ కొనసాగింపు ఉండదు.)



రాజి రెడ్డి గారూ..
సుధామయి గారు పంపగా ఆజన్మం పుస్తకం నా దగ్గరికి వచ్చి కొన్ని రోజులు అయిందేమో సగం చదివి మళ్లీ నా శరీర పిపీలిక బాధల్లో పడ్డాను. అప్పుడే ఝుంపా లహరి కొత్త పుస్తకం ‘Whereabouts‘ వస్తే మొదలెట్టాను.
అప్పుడు మళ్ళీ ఆజన్మంకి షిఫ్ట్‌ అయి పూర్తి చేశాను. గొప్ప గొప్ప రచయితలు అందరూ ఒకేలా ఆలోచిస్తారు ఏమో.
వాళ్లు మాత్రమే పాడగల ఒక జన్మాంతర స్వరం వినిపిస్తారు అనిపించింది. ఏదో రోజు ఈ రెండిటి మధ్య నేను గమనించిన విషయాలు అన్నీ రాస్తాను.
కానీ, ఆజన్మం రాసిన మీరు తెలుగువాడు అన్న విషయం ఆజన్మాంతం గుర్తు పెట్టుకుంటాను.
మారుతున్న స్థల, కాల, విలువల్లో... మిమ్మల్ని అక్షరాల్లో బ్రతికించుకున్నారు. ధన్యవాదాలు.
జన్మదిన శుభాకాంక్షలు!

అభిమానంతో,
సాయి పద్మ


 

No comments:

Post a Comment