Monday, April 1, 2024

సాక్షి- పుస్తక పరామర్శ - గంగరాజం బిడ్డ



రాజిల్లే జీవన తాత్త్వికత


సీనియర్ జర్నలిస్ట్, రచయిత పూడూరి రాజిరెడ్డి ఏడేళ్ల 'కలం’కారీ తనం కలబోసుకుని 'గంగరాజం బిడ్డ'గా మన ముందుకు వచ్చింది. పన్నెండు కథల ఈ సంపుటి రచయిత గత
కథలకు భిన్నమైనది. ఇందులోని కథలలో సగం ఒక విధమైన మోహపరవశంతో కూడినవి కాగా మరో సగం కథలు 'రెండోభాగం', 'మెడిటేషన్', 'ఎడ్డి, 'జీవగంజి' 'కొండ', 'ఎఱుక' కథలు ఒకవిధమైన జీవన తాత్త్వికతను చెబుతాయి. వీటన్నింటిలోనూ బాల్యం నుంచి టీనేజీ, పెళ్లీడు, ఆ తర్వాత, మధ్య వయసు... ఇలా అన్ని దశలలోనూ పురుషుడే తనలో ముప్పిరిగొనే అనేక భావాలను వ్యక్తం చేస్తూ పోతాడు. ఆయా పాత్రల ఆలోచనాధారలో 'ఇదంతా నా గురించేనేమో' అని చదువరులు అనుభూతి చెందేలా చేసే రచనా చాతుర్యం అబ్బుర పరుస్తుంది. అచ్చమైన తెలంగాణ మాండలికంతో కొసంటా చదివింపజేసే ఈ కథలలో కొన్ని పదాలకు అర్థాలు తెలియకున్నా, కథాగమనానికి భంగం వాటిల్లదు. 

గంగరాజం బిడ్డ, మరిన్ని కథలు
రచన: పూడూరి రాజిరెడ్డి, ఫోన్: ---
పుటలు:116; వెల రూ. 150
ప్రతులకు: సేపియన్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్,
1-3-63/2, మల్బౌలి స్ట్రీట్, నల్గొండ-
508001. 9912460268; 
పుస్తక విక్రయ కేంద్రాలు

-DVR

(03/03/2024 | ఫన్‌డే) 

No comments:

Post a Comment