Wednesday, September 5, 2012

మిత్రుడి మొదటి పుస్తకం

"అచ్చు వేస్తే బానేవుంటుంది కదా,'' అన్న ఆలోచన నుంచి-
"అచ్చు వేయకపోతేనేం?'' అన్న సంశయాన్ని దాటుకొని-
ఎట్టకేలకు తొలిసారిగా 'అచ్చు'లోకి వచ్చాడు ఆత్మీయుడు మాధవ్ శింగరాజు , 'అభౌతిక స్వరం' పుస్తకం ద్వారా.

ప్రచురించదగిన 'రాశీనక్షత్రాలు' ఉన్నప్పటికీ, 'నా గొప్పలకేంగానీ,'లే అన్నట్టుగా వాటిని అలా మౌనంగా వదిలేసి,  ఇదిగో, గొప్పవాళ్ల గొంతును అంతే గొప్పగా వినిపిస్తున్నాడు. అలెన్కర్ నుంచి యూరీ గగారిన్ వరకు యాభై 'గ్రేట్ సోల్స్' ఆత్మను ఎంతో ఆత్మీయంగా, మంద్ర స్వరంలో గానం చేస్తున్నాడు. వచనం కవిత్వమైనప్పుడు పాడితేనే బాగుంటుంది కదా!

అభౌతిక స్వరం ఆవిష్కరణ మొన్నటి శుక్రవారం జరిగినప్పటి ఫొటో ఇది. ఇందులో వరుసగా (ఫొటోకు ఎడమ నుంచి) యాసీన్ గారు, మాధవన్న, రామకృష్ణారెడ్డి గారు, మురళి గారు, వేణు గారు, నేను.

పుస్తకం 'విశాలాంధ్ర'లో లభ్యం. లేదా, ఎస్.ఎల్.వసుంధర గారిని ఈ నంబరులో సంప్రదించవచ్చు. 98486 18166.

Friday, February 17, 2012

మళ్లీ టైప్ చేసే పని తప్పింది!

నేను కంపోజ్ చేసిపెట్టే ఐటెమ్స్ కంటే, ఇమేజెస్-గా ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను.
అయితే, కొన్ని రోజులుగా బ్లాగులో లైట్ బాక్స్ అని వస్తోంది. ఇమేజెస్ థంబ్ నెయిల్స్ లాగా వరుసగా డిస్ ప్లే అవుతాయి. అక్షరాలు మసగ్గా ఉంటాయి.
దానికి కంట్రోల్ ప్లస్ ప్లస్ అని జూమ్ చేసుకోవడమో, లేకపోతే ఇమేజ్-ను డెస్క్ టాప్ మీద కాపీ చేసుకుని చూడాల్సి రావడమో పరిష్కారంగా ఉండింది. అది కొంత అసౌకర్యం. దానివల్ల మిత్రులు చాలామంది ఇబ్బంది పడేవుంటారు. దాన్ని తొలగించేందుకు, మళ్లీ ఇవన్నీ రీ కంపోజ్ చేసి ఎలా పెట్టాలి, అనుకున్నా.
అయితే, బ్లాగు మిత్రురాలి సలహా (తను ఇంకెవరినో సలహా అడిగిందట) మేరకు ఆ లైట్ బాక్స్ ఇమేజెస్-ను డిజేబుల్ చేసేశాను. ఇప్పుడు ఇమేజెస్ రూపంలో ఉన్నది ఈజీగా చదువుకోవచ్చు.
చాలా ఈజీ పరిష్కారం ఇన్ని రోజులు తెలియనందుకు బాధ పడుతూనే, ఇప్పటికైనా తెలిసినందుకు ఆనందపడుతూ, ఇంకెవరికైనా పనికొస్తుందేమోనని ఈ లింకు దిగువన ఇస్తున్నా.
http://googlesystem.blogspot.in/2011/10/how-to-disable-bloggers-lightbox.html

Monday, February 13, 2012

డైరెక్టర్ సుకుమార్ ఇన్నర్ వ్యూ



50 మంది బ్లాగు మిత్రులు

నా బ్లాగు ఫుకుఓకా ఫామ్-ను రీ డిజైన్ చేశాక-
మిత్రులుగా చేరడానికి పెట్టిన ఆహ్వానాన్ని స్వీకరించి ఇప్పటికి యాభై మంది మిత్రులుగా చేరారు.
ఇందులో నాకు ముఖపరిచయం ఉన్నవాళ్లు కేవలం నలుగురే. అంటే భౌతికంగా వాళ్ల ముఖం నేనూ, నా ముఖం వాళ్లూ చూసుకున్నవాళ్లం. ముఖ పరిచయం లేకపోయినా, అరే, నేనింకా వీళ్లను ఇప్పటిదాకా చూడలేదా... అనుకునేంత పరిచయం అయినవాళ్లు మరి ఆరేడుగురు. ఇంకా కొందరి తాలూకు పరిచయాలకు పూర్ణ రూపం రాకపోయినా, ఒక సంకేతమేదో వాళ్లను తలుచుకున్నప్పుడు నా మనసులో మెదులుతూ ఉంటుంది. మరికొందరు పూర్తి గుప్తంగా ఉండిపోయినవాళ్లు. అంటే వాళ్ల తాలూకు ఏ ఊహకీ అవకాశం ఇవ్వకుండా, బహుశా మౌనంగా నన్ను గమనిస్తున్నవాళ్లు.
ఎవరెవరు ఎక్కడెక్కడ, ఏయే పనుల్లో, ఏయే రాష్ట్రాల్లో, ఏయే దేశాల్లో ఉన్నారో... మీ అందరినీ ఒకసారి నేను పేరుపేరునా తలుచుకుంటున్నానని చెప్పడానికే ఈ పోస్టు.
అరవిందాచారి
సుధాకర్ శివరాత్రి
వాసు
బాలు
నాగ్
రమేష్
మూన్
సంతోష్ కుమార్
శాండీ
దాస్
అఫ్సర్
గీతిక
సాయి మహేశ్ రెడ్డి
రాజు
శివకాశి
విజయ మైమూన్
స్కైబాబా
ఎన్.రావు
హెచ్చార్కె
గురు
అక్షర
రమ
అంజిరెడ్డి ధర్మ
సుభాషిణి పోరెడ్డి
చక్రి
వై వనజ
బాలు-2
సూర్య
రామ్
అజయ్ త్రిపాఠి
అండెం లింగారెడ్డి
పాండురంగాచారి
మధురవాణి
అశోక్
తన్నీరు శశి
రవి మూత
బృహస్పతి
వినయ్
రఘు
పైడినాయుడు గవిడి
జ్వాల
ఎందుకో ఏమో
జోయెల్
కవి యాకూబ్
ఎం.సుధాకర్రెడ్డి
సతీష్ కుమార్
శరత్
అజయ్ గౌడ్
పవన్
విష్ణు కానుమతిరెడ్డి

Saturday, January 28, 2012

శేఖర్ ఇలా అన్నారు

నేను సాధారణంగా బ్లాగులు ఎలా చదువుతానంటే,
నాదాంట్లో ఎవరో కామెంటు రాస్తారు, లేదంటే మిత్రులుగా చేరుతారు. వీళ్లెవరు?
నా మీద ఆసక్తి చూపించిన వీళ్లమీద ఇక నాకు ఆసక్తి మొదలవుతుంది.
అలా, వాళ్ల (ఉంటే) బ్లాగు, అందులో కామెంట్లు రాసినవాళ్లు, వాళ్లు మిత్రులుగా ఉన్న ఇతర బ్లాగులు... ఇలా పోతూ పోతూ ఎక్కడికో తేలుతాను. అలా నాకు కొన్ని చాలా చక్కటి బ్లాగులు పరిచయమయ్యాయి.
ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే... మొన్న ఇలా ఒక తోక వెంబడి, ఆ తోకతో మరో తోకలోకి ఇలా పోతూ పోతూ పోతే... ఒకచోట శేఖర్ కపూర్ బ్లాగు తగిలింది. ఆయన తన బ్లాగుకు రాసుకున్న పరిచయం వాక్యాలు అద్భుతంగా తోచాయి. వాటిని దిగువన ఇస్తున్నాను.
I exist because you imagine I do.

ఈ తర్వాతిది ఇంకా బాగుందనిపించింది.

Neither prejudiced by the past, nor in fear of the future.
The moment, only the moment.