
2009లో వచ్చిన ఉత్తమ కథలను తిరుపతికి చెందిన అభినవ ప్రచురణలు సంపాదకుడు సాకం నాగరాజ సంకలనం చేశారు. ఈ తరహాలో వారి నుంచి ఇది తొలి ప్రయత్నం. ఇందులో నా కథ చింతకింది మల్లయ్య ముచ్చట కూడా చోటు చేసుకుంది. దీనికోసం నేను మొట్టమొదటిసారిగా తిరుపతికి వెళ్లాల్సివచ్చింది. రెండ్రోజులు జీవితాన్ని మరింతగా విస్తరించుకున్నట్టు అనిపించింది. ఒకట్రెండు క్వాలిటీ పరిచయాలు జరిగాయి.
ఫొటో రైటప్... ఎడమనుంచి వరుసగా: మహమ్మద్ ఖదీర్ బాబు, దగ్గుమాటి పద్మాకర్, బి.చంద్రశేఖర్, వేంపల్లి షరీఫ్, పూడూరి రాజిరెడ్డి, సాకం నాగరాజ, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, బి.వినోదిని.